కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

by  |
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
X

దిశ, నిజామాబాద్: కొవిడ్ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, వైద్య సిబ్బంది రక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ.. కరోనా విస్తరిస్తున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసనలో ధన్‌పాల్ సూర్యనారాయణ, ఫ్లోర్‌లీడర్ స్రవంతి రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed