అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారు: చింతల

by  |
అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించారు: చింతల
X

దిశ, వెబ్‌డెస్క్: మేయర్ ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం ఉందనడం అర్థ రహితమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు మంగళ వారం కలిశారు. మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని వారు కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….24 గంటల్లో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరసన చేపడతామని చెప్పారు. మేయర్ ఎన్నికలకు సమయం ఉంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదరలేదని, అందుకే మేయర్ ఎన్నికను వాయిదా వేశారని బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ చెప్పినట్టే ఎస్ఈసీ వ్యవహరిస్తోందని అన్నారు.



Next Story

Most Viewed