టెన్షన్ టెన్షన్.. బీజేపీ నాయకులు అరెస్ట్

by  |
టెన్షన్ టెన్షన్.. బీజేపీ నాయకులు అరెస్ట్
X

దిశ, భద్రాచలం టౌన్ : బీజేపీ ఇచ్చిన పిలుమేరకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాకు వెళ్లకుండా భద్రాచలంలోని బీజేపీ నాయకలను, పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దళిత, గిరిజన, బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు మహా ధర్నాకు బయలు దేరిన బీజేపీ భద్రాచలం మండల అధ్యక్షుడు, మలిసెట్టి రామ్మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ రావు, లక్ష్మీనరసింహశర్మలు భద్రాచలం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రజా నిరసన కార్యక్రమాలను అణిచివేయడం కంటే కేసీఆర్ ప్రభుత్వం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.



Next Story

Most Viewed