'కేసీఆర్, జానారెడ్డి మంచి దోస్తులు'

by  |
కేసీఆర్, జానారెడ్డి మంచి దోస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మంచి దోస్తులని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేళ ఇవాళ నియోజకవర్గంలో విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘జానారెడ్డి సాగర్‌కు ఏం చేశారు. ఏం చేయలేదనే గత ఎన్నికల్లో ఓడగొట్టారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌కు అమ్ముకున్నారని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, అన్ని కబ్జాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నిలదీస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని విజయశాంతి తెలిపారు.

Next Story

Most Viewed