దోచుకోవడానికి ఛాన్స్‌ ఉండదనే విమర్శలు !

by  |
దోచుకోవడానికి ఛాన్స్‌ ఉండదనే విమర్శలు !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. దోచుకోవడానికి అవకాశం లేకుండా పోతుందనే కొత్త విద్యుత్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం వాటా కింద ఇప్పటివరకు రూ.70వేల కోట్లు తెలంగాణ కేటాయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తు నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో లక్ష్మణ్ పై వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed