- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నాగార్జున సాగర్: వరంగల్ లో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్ఎస్ గుండాలు దాడికి దిగారూ. అంతేకాదు హైవేపై ఎంపీ వాహనాన్ని సైతం వెంబడించారు. సోమవారం నల్గోండ జిల్లా పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశనికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ జిల్లా నాయకులు గర్లపాటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రోజురోజుకు బలోపేతమవుతోన్న బీజేపీ పట్ల టీఆర్ఎస్ లో అసహనం కట్టలుతెంచుకుంటోందన్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై గులాబీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడికి పాల్పడ్డారని, ఎంపీపై టీఆర్ఎస్ గూండాలు, హిందూ వ్యతిరేక శక్తులు దాడికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతుందా లేక నిజాం నియంతృత్వ, నిరంకుశ పాలన కొనసాగుతుందా అని ప్రశ్నించారు. జరిగిన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బెజవాడ పెద్దయ్య కామిశెట్టి మారయ్య సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి గౌస్ మధు తదితరులు పాల్గొన్నారు.