ఏపీ సీఎం జగన్‌తో.. కేసీఆర్ లాలూచీ పడ్డారు

by  |
ఏపీ సీఎం జగన్‌తో.. కేసీఆర్ లాలూచీ పడ్డారు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వివాదాలకు దారితీసిన పోతిరెడ్డిపాడుపై మాజీ మంత్రి, బీజేపీ నాయకులు డీకే. అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె విలేకరులో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారని ఆమె ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో సీఎం కేసీఆర్ లాలూచీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.



Next Story