మమతపై దాడి.. సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

by  |
మమతపై దాడి.. సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం రాత్రి జరిగిన దాడితో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఇది ప్రతిపక్షాల కుట్ర అని మమతా ఆరోపిస్తుండగా.. ఇదంతా మమతా డ్రామా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మమతా దాడి చేయించుకున్నారని, పోలీసులు ఉండగా దాడి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో మమతపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేసింది. ఇక ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed