బీజేపీ కార్పొరేటర్ కారు అద్దాలు ధ్వంసం..

by  |
బీజేపీ కార్పొరేటర్ కారు అద్దాలు ధ్వంసం..
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడి పది రోజులైన గడువక ముందే బీజేపీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్ కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్‌ శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

బీజేపీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి న్యూ ఫార్చునర్ కారు అద్దాలను ఇటుక రాయితో ధ్వంసం చేయగా సైరన్ మోగింది. ఆ శబ్దానికి పలువురు బయటకు రాగా, దుండగులు పారిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story