గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కమిటీ ఏర్పాటు

by  |
గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ.. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టి దూసుకెళ్తోంది. ఇదేక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసి.. ఛైర్మన్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కన్వీనర్‌‌గా లక్ష్మణ్‌ను నియమించింది. అటు.. జాయింట్ కన్వీనర్లుగా వివేక్, గరికపాటి రాంమోహన్‌ పేర్లను పార్టీ ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనన్న బీజేపీ నేత లక్ష్మణ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు జాతీయ స్థాయిలో సైతం సంసిద్ధం అవుతున్నట్లు ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలను అప్పగించినట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed