జిల్లాల యాత్రకు బండి రెడీ….

by Shyam |

<p>దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో రజాకార్ల అరాచకాలకు సాక్ష్యంగా నిలిచిన స్థలాలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించనున్నారు. ఈ మేరకు జిల్లాల యాత్రకు ఆయన రెడీ అయ్యారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లోఆరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన యాత్రను మొదలు పెట్టనున్నారు. మొదటి రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, రేణి కుంటలో ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని [&hellip;]</p>

జిల్లాల యాత్రకు బండి రెడీ….
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో రజాకార్ల అరాచకాలకు సాక్ష్యంగా నిలిచిన స్థలాలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించనున్నారు. ఈ మేరకు జిల్లాల యాత్రకు ఆయన రెడీ అయ్యారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లోఆరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన యాత్రను మొదలు పెట్టనున్నారు. మొదటి రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, రేణి కుంటలో ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి, కూటగళ్లు, ఆకునూరుకు చేరుకుంటారు. తర్వాత వరంగల్ రూరల్ జిల్లాలోని అమరాథామాన్ని సందర్శిచనున్నారు. అనంతరం గోదావరి ఖనిలో బస చేయనున్నారు. తర్వాత రోజు ఉదయం కొమురం భీం, అసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్, నిర్మల్ లో ని వేయి ఊడల మర్రి వెళ్తారు. సాయంత్రానికి నిజామాబాద్ లోని ఖిల్లాలో పర్యటించనున్నారు.

Next Story