సీఎం కేసీఆర్‌కు అంత బిజీ ఏముంది: బండి సంజయ్

by  |
సీఎం కేసీఆర్‌కు అంత బిజీ ఏముంది: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఉన్నది కేవలం నకిలీ ప్రేమ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌లో నివాళులర్పించిన సంజయ్ మీడియాతో మాట్లాడారు. పీవీ వర్థంతి కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడం ఆయన్ను అవమానించడమేనని, అసలు కేసీఆర్‌కు అంత బిజీ పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే పీవీ జయంతి ఉత్సవాలు చేశారని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. బయటకు రావట్లేదన్నారు. అసలు కేసీఆర్ ఎక్కడున్నారో, ఎక్కడ పడుకున్నారో తెలియదన్నారు.

Next Story

Most Viewed