ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది : రఘునందన్ రావు

by  |
ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది : రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా.. ప్రజలు సంయమనంతో ఓటింగ్‌లో పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో మంగళవారం దుబ్బాకలో మీడియాతో సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ… తమపై ఎన్ని దొమ్మి కేసులు పెట్టినా.. ఎంత వేధింపులకు గురిచేసినా, ప్రజల దీవెన తమపై ఉందనే విశ్వసముంది అని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అన్నారు.


Next Story