బీజేపీ అభ్యర్థిపై దాడి.. ఆయనకు గాయాలు, కారు ధ్వంసం

by  |
బీజేపీ అభ్యర్థిపై దాడి.. ఆయనకు గాయాలు, కారు ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీఎంసీ, బీజేపీ నేతల మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్ని్కల ప్రచారంలో భాగంగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి అశోక్ దిండాపై దాడి జరిగింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఒక గుంపు దిండాపై దాడి చేశారు. ఈ దాడిలో తనకు స్వల్ప గాయలైనట్టు ఆయన తెలిపారు.

దిండా ప్రయాణిస్తున్న కారుపై సుమారు 50 మందితో కూడిన గుంపు రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అశోక్ దిండా.. మొయినా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు.


Next Story