నిజామాబాద్: బీజేపీ కార్యకర్త దారుణ హత్య.. టీఆర్ఎస్ నేత అరెస్ట్

by  |
Armor ACP Raghu
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్ గ్రామం మారుతీనగర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త సిద్దార్థ్‌ను టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కనకం రాజేష్ హత్యచేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై స్థానిక ఆర్మూర్ ఏసీపీ రఘు కీలక వివరాలు వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ అన్నారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సిద్దార్థ్‌ను హత్య చేసిన రాజేష్‌ను, ఆయనకు సహకరించిన పథీృరాజ్, అన్వేష్, బాలాగౌడ్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించామని స్పష్టం చేశారు. అంతేగాకుండా.. ఈ హత్యకు సహకరించిన నందిపేట మండలానికి చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఏసీపీ తెలిపారు.

Next Story