గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం

by  |
గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆన్‌లైన్ మాధ్యమంగా రాజ్‌భవన్ నుంచే బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని తెలిపారు. మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టం చేశారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని ప్రకటించారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ఆన్‌లైన్ మాధ్యమంగా అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడటం భారత్‌లో ఇదే తొలిసారి.

Next Story