RS ప్రవీణ్ కుమార్ వెంటే మేమంటూ..

by  |
rs-praveen-kumar
X

దిశ, పరకాల : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన కులాల ఐక్యత లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తానని ఆశిస్తూ ఆదివారం స్వేరోస్ అనుబంధాల ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్వేరోస్ మహిళా విభాగం రాష్ట్ర నాయకులు అక్కినపల్లి శిరీష జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గా ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ బహుజన కులాల ఐక్యత కోసం రాజీనామా చేయడం హర్షణీయమన్నారు.

వారి భవిష్యత్ కార్యాచరణలో దళిత బహుజన సంఘాలు ఫెరోజ్ ఎల్లవేళలా అండగా ఉంటాయని అన్నారు. వారి రాజకీయ నిర్ణయాన్ని గౌరవిస్తామని చేయడంలో భాగంగానే ఈరోజు పరకాల కేంద్రంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ బహుజన సంఘాల నాయకులు దొగ్గెల వినయ్ ఎ. శ్రీనివాస్, బొల్లె మధుకర్, స్వేరోస్ విద్యార్థి సంఘం రూరల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed