ఏపీలో చంద్రబాబుకు బిగ్‌షాక్.. వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కీలక నేత

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-20 08:27:04  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీడీపీకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ఎస్ఎమ్ జియాఉద్దీన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ జియా ఉద్దీన్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. రెండు సార్లు [&hellip;]</p>

ap news
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీడీపీకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ఎస్ఎమ్ జియాఉద్దీన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ జియా ఉద్దీన్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి అండగా నిలిచామని అయితే తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. మీ నాయకత్వంలో పనిచేయడానికి మనసు అంగీకరించడం లేదని అందువల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story