నేడు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ

by  |
నేడు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భూమా అఖిల ప్రియను ఏ2 నుంచి ఏ1 నిందితురాలిగా మార్చారు. అఖిలప్రియపై ఐపీసీ 147, 385 సెక్షన్లు అదనంగా చేర్చారు పోలీసులు. A3 గా ఉన్న భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ అనంతరం‌ భార్గవ్ రామ్ బెంగళూరుకు అటు నుంచి‌ మైసూర్ వెళ్లినట్లు తెలుస్తోంది.

మరోవైపు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా A1 అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది. కిడ్నాప్‌నకు సంబంధించి సాంకేతిక ఆధారాలతో పోలీసుల విచారణ చేపట్టారు. నేడు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కాగా, అఖిలప్రియన ఏ1గా మార్చడంపై సోదరి మౌనికారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది.

Next Story