భివాండీ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య 

by  |
భివాండీ ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య 
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర, భివాండీలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురిని ఇప్పటికే గుర్తించారు.

కాగా ఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడగా 8మంది అప్పటికప్పుడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

Next Story