చిన్నపిల్లలకు వ్యాక్సిన్: భారత్ బయోటెక్ కీలక ప్రకటన

by  |
చిన్నపిల్లలకు వ్యాక్సిన్: భారత్ బయోటెక్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులకు రెండు నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఒక ప్రకటన జారీ చేశారు. చిన్నపిల్లలపై ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయని చెప్పారు. మరో నెల రోజుల్లో చిన్నపిల్లల వ్యాక్సిన్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. టీకాకు డీసీజీఐ నుంచి అనుమతి రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని కృష్ణ ఎల్ల తెలిపారు. కోవిడ్, రేబిస్‌లకు ఒకే టీకా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.



Next Story

Most Viewed