బాధ్యతలు చేపట్టిన శివాజి…

by  |
బాధ్యతలు చేపట్టిన శివాజి…
X

దిశ, భద్రాచలం :
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవోగా బి. శివాజి మంగళవారం బాధ్యతలను చేపట్టారు. ఈవోగా నియమితులైన ఆయన కుటుంబ సమేతంగా వచ్చి తొలుత భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కొత్త ఈవోకి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికారు‌. పూజాకార్యక్రమాల అనంతరం దేవస్థానం క్యాంపు కార్యాలయానికి వెళ్ళి రికార్డులో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈవో శివాజి తెలిపారు.


Next Story

Most Viewed