- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన లింగాపురంనకు చెందిన కాకా జోగారావు అనే యువకుడికి పై చదువుల కోసం ఆర్థిక సాయాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అందజేశారు. భారతదేశంలోనే ఏకైక నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో సీటు సాధించిన కాకా జోగారావు కాలేజీలో చేరడానికి ఫీజు కట్టలేక ఆర్థిక సమస్యలతో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎస్పీ.. జోగారావుకు రూ. 20,000 ఆర్ధిక సాయం చేశారు. అంతేకాకుండా ఒక్కొక్క సంవత్సరానికి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుందని తెలియజేయడంతో చదువు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులను సమకూరుస్తామని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్ జి ఐపీఎస్, దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Next Story