సీఎల్పీ నేత భట్టితో ఎమ్మెల్యే పొదెం వీరయ్య భేటీ

by  |
సీఎల్పీ నేత భట్టితో ఎమ్మెల్యే పొదెం వీరయ్య భేటీ
X

మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదివారం భేటీ అయ్యారు. మధిర నియోజకవర్గంలోని భట్టి నివాసంలో వీరు అత్యవసర సమావేశం అయ్యారు. ఇటీవల పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్ఎస్‌లో చేరుతున్నాడన్న ప్రచారం జరగడంతో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. అనంతరం భట్టి మాట్లాడుతూ.. వీరయ్య మార్టీ మారుతున్నట్టు టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, పొదెం పార్టీ మారే ప్రసక్తే లేదని భట్టి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed