అలాంటి వారికి ఇదే గతి పడుతుంది.. బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

by  |
అలాంటి వారికి ఇదే గతి పడుతుంది.. బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. బెంగాల్ లో నాలుగో దశ పోలింగ్‌లో కేంద్ర బలగాల కాల్పులకు గురై మరణించిన వారిని ‘నాటీ బాయ్స్’ అంటూ అభివర్ణించారు. అలా చేసేవారికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.

ఆదివారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘సితాల్‌కుచిలో అల్లర్లకు పాల్పడిన కొంటె కుర్రాళ్లకు బుల్లెట్లు సమాధానం చెప్పాయి. అలా ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది’ అంటూ వ్యా్ఖ్యానించారు. ఈనెల 17న ఐదో దశ పోలింగ్ లతో ఎవరైనా సితాల్‌కుచిలో చేసినట్టు ఘర్షణలకు పాల్పడితే వారికి ఇదే జరుగుతుందని హెచ్చరించారు. కూచ్‌బెహర్ జిల్లాలోని సితాల్‌కుచిలో జరిగిన నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా జరిగిన ఘర్షణల్లో కేంద్ర బలగాలు నలుగురిని కాల్చిన విషయం తెలిసిందే. కాగా, దిలీప్ ఘోష్ కామెంట్లపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయనపై ఈసీకి పిర్యాదు చేసింది. సీపీఐ(ఎం) స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలు బీజేపీ ఫాసిస్టు పాలనకు నిదర్శనమని విమర్శించింది. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.



Next Story

Most Viewed