ఈజిప్ట్ లో మనోళ్లు.. వరల్డ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్..

by  |
ఈజిప్ట్ లో మనోళ్లు.. వరల్డ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్స్..
X

దిశ, బేగంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత ఈజిప్టులో జరిగిన ప్రపంచ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించారు. బేగంపేటకు చెందిన ఆశిష్ చందు తో పాటు, ఇదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని లహరి గిరీష్ గోల్డ్ మెడల్ సాధించినట్లు బాక్సింగ్ కోచింగ్ అరుణ్ సింగ్ వెల్లడించారు. యువత శిక్షణ కొరకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సహకారం అందించారు అని కొనియాడారు. విద్యార్థులకు అండగా నిలిచి.. వారికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆశిష్ చందు తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed