- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అబ్దుల్లాపూర్మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో అవినీతి, అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యవైఖరి కాంట్రాక్టర్లకు లాభాలను చేకూర్చుతోంది. ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలన్న ఆలోచన కాంట్రాక్టర్లకు లేకుండా పోయింది. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు శోభానగర్లో గత నెలలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యతలేమీ స్పష్టంగా కనబడుతోంది. డ్రైనేజీ ఇంకా ప్రారంభమవకముందే మ్యాన్హోల్స్ దగ్గర తూట్లు (రంద్రాలు) దర్శనమిస్తున్నాయి. సరైన మోతాదులో ఇసుక, సిమెంట్ కలపాల్సిన కాంట్రాక్టర్… డస్ట్, పటుత్వం ఉండని సిమెంట్ ఇటుకలతో పనులు చేసి, ప్రజాధనం దుర్వినియోగం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story