వ్యాక్సిన్ ట్రయల్స్ అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు

by  |
వ్యాక్సిన్ ట్రయల్స్ అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు
X

న్యూఢిల్లీ: తాము అభివృద్ధి చేస్తున్న నాజల్ వ్యాక్సిన్(ముక్కు ద్వారా వేసే టీకా) ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ భారత రెగ్యులేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ప్రతిపాదనలు పంపింది. ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందిన విషయం విధితమే. కొవాగ్జిన్‌ కాకుండా కరోనాను ఎదుర్కొనే నాజల్ వ్యాక్సిన్‌నూ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ. కృష్ణ మోహన్ తెలిపారు.

ఈ టీకా మొదటి, రెండో ట్రయల్స్ నాగ్‌పూర్‌లోని గిల్లుర్కార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నది. డీసీజీఐ నుంచి అనుమతులు రాగానే హైదరాబాద్, నాగ్‌పూర్, పూణె, భువనేశ్వర్‌లలో 30 నుంచి 45 మంది ఆరోగ్యవంతులైన పార్టిసిపెంట్లపై ఈ టీకా ట్రయల్స్ నిర్వహించనుంది. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నామని, కరోనాను ఎదుర్కోవడానికి ముక్కు ద్వారా టీకా వేసే పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పినట్టు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.

Next Story