బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, న్యూస్ బ్యూరో: బ్యాంకు మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్వరూప్‌నగర్‌‌కు చెందిన బాల సుందరం(38) కింగ్ కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలో మేనేజర్‌గా ప‌ని చేస్తున్నాడు. బాలసుందరం ఆదివారం ఉదయం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం పక్కనే తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నది. ఆ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్ట‌ం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిట‌ల్‌కు తరలించిన [&hellip;]</p>

దిశ, న్యూస్ బ్యూరో: బ్యాంకు మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్వరూప్‌నగర్‌‌కు చెందిన బాల సుందరం(38) కింగ్ కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలో మేనేజర్‌గా ప‌ని చేస్తున్నాడు. బాలసుందరం ఆదివారం ఉదయం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం పక్కనే తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నది. ఆ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్ట‌ం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిట‌ల్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల‌ను
వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

Tags: Hyderabad, andhra bank,suicide,uppal, manager, police,crime

Next Story