26న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

by  |
26న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 26న బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రభుత్వ విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు ధ్వంసం చేస్తున్నాయని, నూతన ఆర్థిక విధానాలతో 40ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీశాయన్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ దివాళా తీస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయకుండా సింగపూర్ బ్యాంక్ అయిన డీబీఎస్ కలిపాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుతూ, కార్పొరొట్ మొడి బకాయిల వసూలుకు తగిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed