గిల్ట్ నగలతో బ్యాంక్ అప్రైజర్ బురిడి..

by  |
గిల్ట్ నగలతో బ్యాంక్ అప్రైజర్ బురిడి..
X

కృష్ణా జిల్లా
మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ నగలతో బ్యాంకు అప్రైజర్ ఖాతాదారులను బురిడీ కొట్టించాడు. దాదాపు 500 మంది ఖాతాదారుల పేర్లతో రోల్డ్‌గోల్డ్ తాకట్టుపెట్టి లక్షల్లో బ్యాంక్‌‌కు టోపీపెట్టాడు. బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి గోల్డ్ లోన్లను స్వాహా చేశాడు. అనుమానం వచ్చిన మేనేజర్ నగలను తనిఖీ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగలు సరిచూసుకోవాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు.

tags;bank appraiser fraud, krishna, central bank, gold loan



Next Story

Most Viewed