- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: టాలీవుడ్ ప్రొడ్యూసర్, యాక్టర్ బండ్ల గణేశ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ అభిమానులందరికీ ఆ విషయం విదితమే. కాగా ఈ రోజు(ఆదివారం) ఆయన ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ‘ప్రియమైన మిత్రులారా.. ఇది నా ఇన్స్టా అకౌంట్, ఇక్కడ మీరు నన్ను ఫాలో కావచ్చు’ అని ట్వీట్ చేశాడు. ఈ మేరకు ఇన్స్టాలో తొలి ఫొటో పవన్ కల్యాణ్దే షేర్ చేసిన గణేశ్.. అక్కడ కూడా పవన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అది కూడా ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటో కావడం విశేషం.
కాగా, బండ్ల గణేశ్ షేర్ చేసిన ఫొటో చూసి ‘ట్రూ ఫ్యాన్ బాయ్, మొదట దేవుడి ఫొటోను షేర్ చేశావ్’ అని కామెంట్ చేస్తున్న నెటిజన్లు.. జయహో పవనిజం అని పోస్టులు పెడుతున్నారు. ఇక గణేశ్ ఇప్పటికే పలు ఈవెంట్లలో పవన్పై అభిమానాన్ని వెల్లడించగా.. ఇటీవల ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ హైలైట్గా నిలిచింది. ‘ఈశ్వరా పవరేశ్వరా పవనేశ్వరా’ అంటూ పవన్ను పొగడ్తల్లో ముంచెత్తిన స్పీచ్ యూట్యూబ్ ట్రెండింగ్లో నిలిచిన సంగతి తెలిసిందే. పవన్తో గతంలో ‘తీన్మార్, గబ్బర్సింగ్’ చిత్రాలు నిర్మించిన గణేశ్, ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న #PSPK28 నిర్మిస్తున్నారు.
Hello dear friends ,
This is my insta account please follow
– ganeshbandlaa .— BANDLA GANESH. (@ganeshbandla) April 25, 2021