కేసీఆర్ కోతల రాయుడు : బండి సంజయ్

by  |
కేసీఆర్ కోతల రాయుడు : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కోతల రాయుడు అని, కోతలు కోయడానికే ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ మద్దతిచ్చిన భారత్ బంద్ విఫలం అయిందని, నూతన వ్యవసాయ విధానాన్ని కేసీఆర్ వ్యతిరేకించడం హాస్యాస్పదం అని అన్నారు. అంతేగాకుండా రైతుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 14న ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed