కేంద్రం చెప్పేవరకు కేసీఆర్‌కు తెలియదు

by  |
కేంద్రం చెప్పేవరకు కేసీఆర్‌కు తెలియదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 114 టీఎంసీలకు బదులు 170 టీఎంసీలు వాడుకుందని, కేంద్రం చెప్పేవరకు సీఎం కేసీఆర్‌కు ఏపీ విషయం తెలియదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏపీ విడుదల చేసిన 203 జీవోపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించిన సంజయ్… కేంద్రంపై విమర్శలు మానుకొని తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. అఫెక్స్ కౌన్సిల్ భేటీని సీఎం కేసీఆర్ సద్వినియోగం చేసుకొని సూచించారు. అటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన ప్రతీ లేఖకు సమాధానం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed