వ్యాక్సిన్‌ కేంద్రాల్లో మోడీ ఫొటో ఏది: బండి సంజయ్

by  |
bandi-sanjay bjp cheif
X

దిశ, కూకట్‌పల్లి: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా సరఫరా చేస్తుంటే.. తెలంగాణ సర్కారు కనీసం కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కెఎన్ఆర్ గార్డెన్స్‌ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు లేవని మండిపడ్డారు. ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుంటే కనీసం మోడీ ఫోటో కూడా పెట్టకుండా ప్రభుత్వం అవమానిస్తోందని బండి ఫైర్ అయ్యారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ప్రకటించనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబందించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.



Next Story

Most Viewed