బీజేపీ పోరాటంతో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్: బండి సంజయ్

by  |
Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పోరాటంతో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లూ ఆయుష్మాన్ భారత్ అమలుకు ససేమిరా అన్న కేసీఆర్ మెడలు వంచి మరీ ఒప్పించామన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం కేంద్రం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సుర్కు పెడితే కానీ కేసీఆర్ సోయి తెచ్చుకోలేదని ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్విట్టర్‌ వేదికగా బుధవారం ఓ ప్రటకన విడుదల చేశారు.

Next Story

Most Viewed