మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బొల్తా..

by  |
మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బొల్తా..
X

దిశ ఏపీ బ్యూరో : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం పల్టీలు కొట్టింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా బాలినేని ఎస్కార్ట్ వాహనం వెళుతోంది. అదే సమయంలో బొలెరో టైర్ పేలడంతో వాహనం పల్టీలు కొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బొలెరో‌లో ఉన్న పాపయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story