సీఎం జగన్‌కు కానుకగా బాలాపూర్ లడ్డూ.. ఎందుకో తెలుసా.?

by  |
సీఎం జగన్‌కు కానుకగా బాలాపూర్ లడ్డూ.. ఎందుకో తెలుసా.?
X

దిశ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బాలాపూర్​లడ్డూను వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మర్రి శశాంక్​రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్​ యాదవ్ రూ. 18 లక్షల 90 వేలకు దక్కించుకున్నారు. 2019 కంటే ఈ సారి రూ. లక్షా 30 వేలకు ఎక్కువ పలికింది. లడ్డూను దక్కించుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్​రెడ్డి మాట్లాడుతూ.. రెండు రాష్ర్టాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.

ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్ ​మోహన్​ రెడ్డికి కానుకగా అందిస్తామని చెప్పారు. బాలాపూర్ లడ్డూ వేలంలో స్థానికులైతే వచ్చే సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బయటి వ్యక్తులు దక్కించుకున్నందున వెంటనే నగదు చెల్లించి లడ్డూను తీసుకెళ్లారు. లడ్డూను దక్కించుకున్న శశాంక్ రెడ్డి, రమేష్​యాదవ్ ఉత్సవ సమితికి నగదును అందజేశారు. బాలాపూర్​ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.

Next Story