బద్వేలు బై పోల్.. జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

by  |
బద్వేలు బై పోల్.. జగన్ సర్కార్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలోని బద్వేలు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజే జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేలు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 10 మండలాలను బద్వేలు డివిజన్‌లోకి తెచ్చేందుకు ప్రతిపాదించింది. అయితే, బద్వేలు నియోజకవర్గంలో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన రోజే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్నికల కోణం ఉందంటూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త డివిజన్ ఏర్పాటుతో కడప జిల్లాలోని ఇతర రెవెన్యూ డివిజన్లలో కొన్ని మండలాలు ఇందులో కలువనున్నట్టు తెలుస్తోంది.



Next Story