‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ శరత్ ను ఎందుకంతలా కొట్టారంటే ?

by  |
‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ శరత్ ను ఎందుకంతలా కొట్టారంటే ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా.. ‘అయ్యయ్యో వద్దమ్మా’ అంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ స్లోగన్ ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం మాత్రం నల్లగుట్ట శరత్. పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తూ, ‘అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు పెట్టాను. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ పాటపాడి తీన్మార్ స్టెప్పు లేశాడు. అంతే, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. టీ పౌడర్ యాడ్ ను ఇలా మార్చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు శరత్. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా స్టార్స్, ఈవెంట్స్ లలో సైతం ‘‘సుఖీభవ’’ స్లోగన్‌ను వాడేస్తు్న్నారు. అయితే, ఇంతలా పాపులర్ అయిన శరత్, ఇప్పుడు తీవ్ర గాయాలతో ముఖం వాచిపోయిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే, ఆ ఫొటో కు ముందు ఓ ఈవెంట్లో సందడి చేస్తూ తీన్మార్ స్టెప్పులేసిన శరత్, కొంత సమయంలోనే ఇలా గాయాలతో కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, అతడిని కొంత మంది వచ్చి కొట్టినట్లు తెలిసింది. అయితే, ‘సుఖీభవ’ స్లోగన్ హిజ్రాలను అవమానపరిచినట్లు ఉందని వారే కొట్టి ఉంటారని నెట్టింట తెగ చర్చ నడిచింది. ఈ క్రమంలో శరత్ తనపై జరిగిన దాడి పై స్పందించారు. గతంలో తన చెల్లిని వేధించిన వారిని కొట్టానని, అప్పుడు జైలుకు కూడా వెళ్లానని చెప్పాడు. జైలు నుంచి వచ్చాక సినిమా చాన్సులు కూడా వచ్చాయని, సుఖీభవ వీడియోతో పాపులర్ అవుతున్నానని ఓర్వలేక ఇలా దాడి చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Next Story