అద్భుత సృష్టి.. 2.730 మిల్లీ గ్రాము బంగారంతో రామ మందిర నమునా తయారీ

by Sathputhe Rajesh |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టాడు.

అద్భుత సృష్టి.. 2.730 మిల్లీ గ్రాము బంగారంతో రామ మందిర నమునా తయారీ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టాడు. అయోధ్యలో రాముల వారి విగ్రహా ప్రతిష్ట సందర్భంగా భవ్య మందిర నిర్మాణం నమూనాను బంగారంతో సృష్టించాడు. అద్భుతంగా తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసి అందరూ స్థానికులు మెచ్చుకుంటున్నారు. 2.730 మిల్లీ గ్రాము బంగారంతో రామ మందిర నిర్మాణము నమూనాను తయారు చేశాడు. గతంలో కూడా అనేక సూక్ష్మ పరికరాలను తయారుచేశాడు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని తెలిపాడు.

Next Story