- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: సంతోషకరమైన సందర్భం వచ్చినపుడు ఇతరులకు స్వీట్లు పంచడం భారతీయ సంప్రదాయం. దీనిని దృష్టిలో పెట్టుకుని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రామ మందిరం ‘భూమి పూజ’ వేడుక సందర్భంగా ఆ ట్రస్ట్ ప్రత్యేక సన్నాహాలు చేసింది. అయోధ్యలో స్వీట్ల పంపిణీతో పాటు ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు బికనేరి లడ్డూలను బహూకరించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 5న జరగబోయే రామ మందిర భూమి పూజకు ట్రస్టు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది.
ఒక్కో స్వీట్ ప్యాకెట్లో నాలుగు లడ్డూల చొప్పున ఉంటాయని ట్రస్ట్ వెల్లడించింది. స్వీట్ల పంపిణీ కోసం మొత్తం 4లక్షల లడ్డు ప్యాకెట్లను సిద్ధం చేసింది. రామ మందిరం భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యకు చేరుకొని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నగరవాసులను తమ ఇళ్ల వద్ద మట్టి దీపాలను వెలిగించాలని ట్రస్టు కోరింది.