అనంతపూర్‌లో అవగాహన సదస్సు

by  |
SI-Tarun-1
X

దిశ, బజార్ హత్నూర్: మండలంలోని అనంతపూర్ గ్రామంలో ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు మరియు కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని, కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సర్పంచ్ పెందుర్ రాజేశ్వర్, గ్రామ పటేల్ హీరామాన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed