రంగాను హత్య చేయించిన పార్టీతో పవన్?

by  |
రంగాను హత్య చేయించిన పార్టీతో పవన్?
X

దిశ ఏపీ బ్యూరో: వంగవీటి రంగాను హత్య చేయించిన పార్టీతో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతులు కలిపారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాపులపై ప్రమ కురిపిస్తున్నారని విమర్శించారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని అన్నారు. గతంలో కాపు సోదరుల్ని చంద్రబాబు నిలువునా ముంచింది నిజం కాదా? అని ప్రశ్నించిన ఆయన, పవన్ కల్యాణ్ అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

లకాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు వేదనకు గురిచేసింది నిజం కాదా? అని అడిగారు. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పోనీ టీడీపీ హయాంలో కాపు యువకులపై పెట్టిన కేసుల సమయంలో అయినా పవన్‌ మాట్లాడారా? అని నిలదీశారు. ఆ కేసులన్నింటినీ జగన్ కొట్టేయించారని ఆయన గుర్తు చేశారు. గతంలో బాబు 1000 కోట్ల చొప్పు ఐదేళ్లలో 5000 కోట్లు ఇస్తామని కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం 1800 కోట్లు మాత్రమే ఇచ్చినప్పుడు పవన్ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? అని అడిగారు. ఏడాది పాలనలో కాపుల అభ్యున్నతికి జగన్ 4000 కోట్లు ఖర్చుచేశారని తెలిపారు.



Next Story