ఆటో బోల్తా… 11 మందికి గాయాలు 

by  |
ఆటో బోల్తా… 11 మందికి గాయాలు 
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయితీ కట్టుబావి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి 11 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో గుఱ్ఱంకొండ మండలం అరిగిలవారిపల్లె, మదనపల్లి మండలం ఇసుకనూతన పల్లెలకు చెందిన రెండు కుటుంబాల మహిళలు ఉన్నారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం సమీపంలోని గిడ్డిగానిపల్లెలో నామకరణం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.



Next Story

Most Viewed