- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కరోనా కారణంగా రెండేళ్లుగా నుంచి క్షీణించిన ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ వచ్చే ఆర్ధి్క సంవత్సరంలో 10-15శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) తెలిపింది. సెమీ కండక్టర్ చిప్ల కొరత, వాహన ఉత్పత్తి, కంటైనర్ల కొరత వలన ఆటో విడిభాగాల పరిశ్రమ 2019 ఆర్ధిక సంవత్సరంలో 57 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆటో కాంపోనెంట్ కంపెనీలు కొత్త టెక్నాలజీ వాహనాల విక్రయాల్లో వృద్ధి, దేశీయ విక్రయాల్లో పునరుద్ధరణ అంచనాలతో తమ మూలధన వ్యయ ప్రణాళికలను పునఃప్రారంభించాయని ACMA ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ తెలిపారు.
ప్యాసింజర్ కార్లకు డిమాండ్ ఉందని, వాణిజ్య వాహనాలకు డిమాండ్ మళ్లీ వస్తోందని.. ఇది మంచి పరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి కాంపోనెంట్ తయారీదారులు పోటిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) పథకం కూడా EVలకు అనుకూలంగా ఊపందుకోవడంలో సహాయపడుతుందని ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త సాంకేతిక వాహనాల తయారీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.