సరదా కాస్త ప్రాణాలనే తీసింది

by  |

దిశ, మెదక్: కాళేశ్వరం జలాలు ఇటీవల రంగనాయక సాగర్ కుడి కాలువకు విడుదల చేశారు. అసలే లాక్‌డౌన్.. ఆపై తీరిక సమయం ఎక్కువే.. ఇంతలో స్నేహితులు వచ్చారు. సరదాగా ఈతకు వెళ్లారు. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మధు(24) స్నేహితులతో కలసి ఆదివారం సరదాగా చంద్లపూర్ సమీపంలో ఉన్న రంగనాయకసాగర్ కుడి కాలువులో ఈతకెళ్లారు. ఈ క్రమంలో మధు కాలువలో మునిగి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మృతితో హౌసింగ్ బోర్డు కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed