మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

by  |
మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… శంషాబాద్ బస్ స్టాండ్ వద్ద కొత్తూరు వెళ్లేందుకు ఓ మహిళ(27) ఆటో ఎక్కింది. ఒంటిరిగా ప్రయాణిస్తుందని భావించిన ఆటో డ్రైవర్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండువల్లి వద్దకు రాగానే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె అరుపులు, కేకలు వేసింది. దీంతో భయాందోళన చెందిన సదరు డ్రైవర్ వెంటనే అక్కడినుంచి పరుగులు తీశాడు. అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story