క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్

by  |
క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్‌‌ను టీమిండియా డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యం విధించిన ఆసీస్.. గెలుపు ఖాయం అని భావించింది. అంతేగాకుండా టీమిండియా వరుస వికెట్లు సమర్పించడంతో కంగారులకు ఇంకా సులువుగా మారింది. ఈ నేపథ్యంలో ఓటమి అంచుల వరకూ వెళ్లి భారత్‌ను హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆదుకున్నారు. ఆసిస్ బౌలర్లకు పరీక్ష పెడుతూ.. చుక్కలు చూపించారు. సులవు అవుతుందని భావించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, చివరకు పూర్తి భిన్నంగా మారడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో భారత బ్యాట్‌మెన్లపై పదే పదే నోరు పారేసుకున్నారు.

ముఖ్యంగా ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ పదే పదే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్- విహారీల వికెట్ ఎలా తీయాలో తెలియక.. అశ్విన్‌పై నోరు పారేసుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మాత్రం త‌న త‌ప్పు తెలుసుకొని క్ష‌మాప‌ణ చెప్పాడు. నేను మ‌నిషిని, నేను చేసిన త‌ప్పుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఈ టీమ్‌ను లీడ్ చేయ‌డాన్ని నేను ఎప్పుడూ గ‌ర్వంగా ఫీల‌వుతాను. కానీ సిడ్నీ టెస్ట్ చివ‌రి రోజు నేను టీమ్‌ను స‌రిగా లీడ్ చేయ‌లేక‌పోయాను. ఒత్తిడిని అధిగ‌మించ‌లేపోయాను అని పేన్ అన్నాడు. ఐదో రోజు ఆట ముగిసిన త‌ర్వాత కూడా అశ్విన్‌తో తాను మాట్లాడిన‌ట్లు తెలిపాడు. నేనో ఫూల్‌గా వ్య‌వ‌హ‌రించాను క‌దా అని అశ్విన్‌తో తాను అన్న‌ట్లు చెప్పాడు. ఇక ఇప్ప‌టికే అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసినందుకు అత‌నికి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.



Next Story

Most Viewed