ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై దాడికి యత్నం

by  |
MLC candidate Premender Reddy
X

దిశ, మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదుర్ మండలం పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం అందడంతో బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి ఘర్షణకు దారి తీసింది. అదే సమయంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌తో కలిసి అక్కడి చేరుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించినట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed